
ఖానాపూర్, వెలుగు: పట్టణంలోని మొగల్ పుర జనావాసాల్లోకి శుక్రవారం సాయంత్రం ఓ నెమలి వచ్చింది. కోతులు వెంటపడడంతో జామా మసీదులోకి వెళ్లింది. ముస్లింలను కోతులను తరిమి, నెమలిని పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రవీందర్, శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. నెమలిని తీసుకెళ్లి, మస్కాపూర్ అడవిలో వదిలేశారు. ఇమామ్, మౌజన్ మౌలానా ఖాదర్, సుజత్ ఉద్దీన్, నాయకులు మేహరాజ్, జహీర్, షకీర్, అమ్జద్ తదితరులున్నారు.